చంద్రబాబు దక్షిణకొరియా పర్యటన పూర్తి వివరాలు
Updated:
01-12-2017 03:03:11
అమరావతి: డిసెంబర్ 4, 5, 6 తేదీలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణకొరియాలో పర్యటిస్తారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధానాంశంగా ముఖ్యమంత్రి సియోల్, బూసన్ నగరాలలో పర్యటిస్తారు. కియా మోటార్స్ హెడ్క్వార్టర్స్ సందర్శించి, బిజినెస్ సెమినార్లో పాల్గొంటారు. కృష్ణపట్నం పోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించిన మరో బిజినెస్ సెమినార్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముఖ్యంగా, బూసన్ సిటీలోని పూసన్ న్యూపోర్టు కంపెనీ, మేకిన్ ఇండియా సెంటర్, నాక్-శాన్ నేషనల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మయోంగ్జీ ఫ్రీ ఎకనమిక్ జోన్ సందర్శిస్తారు.
• కొరియా కార్ల దిగ్గజం ‘కియా’, దాని అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ.13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురము జిల్లాలో ఆల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. ఈ స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఈ యాత్ర తలపెట్టారు.
• డిసెంబర్ 4న ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోబోతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, వేర్ హౌసింగ్, కమర్షియల్ స్పేస్, హౌసింగ్, గోల్ఫ్ కోర్స్ ఇందులో భాగంగా ఉంటాయి. ఇందులో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి. మరో 10 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.
• కియా మోటార్స్కు సంబంధించి 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు డిసెంబర్ 4న ముఖ్యమంత్రితో భేటీ అవుతారు.
• డిసెంబర్ 5న బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం ఉంది.
• డిసెంబర్ 5, 6 తేదీలలో 2 రోడ్ షోలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
• డిసెంబర్ 5న బూసన్ సిటీలో కొరియా భారత రాయబారి కార్యాలయం, ఏపీ ప్రభుత్వంతో కలిసి బిజినెస్ సెమినార్ నిర్వహిస్తారు.
• డిసెంబర్ 6న కియా మోటార్స్తో కలిసి మరో బిజినెస్ సెమినార్ జరుగుతుంది.
• ఈ పర్యటనలోనే కియా మోటార్స్ హెడ్ క్వార్టర్స్ సందర్శించి వైస్ చైర్మన్ HYOUNG KEUN LEE తో భేటీ అవుతారు.
• ముఖ్యమంత్రి బృందంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియా రాజ్, ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిశోర్, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.
మొత్తం ద్వైపాక్షిక సమావేశాలు: 6
ఆటోమైబైల్ దిగ్గజం ‘కియా’ వైస్ చైర్మన్
లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్
(90కు పైగా వివిధ బిజినెస్ యూనిట్స్, క్యాండీ తయారీ, బేవరేజెస్, హోటల్, ఫాస్టుఫుడ్, రిటైల్, ఫైనాన్సియల్ సర్విసెస్, హెవీ కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, కనస్ట్రక్షన్, పబ్లిషింగ్, ఎంటర్టైన్మెంట్)
కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవో
(ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్, లిథియమ్ పాలిమర్స్ బ్యాటరీస్)
OCI కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్
(గ్రీన్ ఎనర్జీ కంపెనీ, పెట్రో అండ్ కోల్ కెమికల్స్, ఇనార్గానిక్ కెమికల్స్, రెన్యువబుల్ ఎనర్జీ ప్రోడక్ట్స్)
యంగ్ వన్ కంపెనీ చైర్మన్
(లీడింగ్ గ్లోబల్ మాన్యుఫాక్చరర్-అవుడ్డోర్ అథ్లెటిక్ క్లాతింగ్, టెక్స్టైల్స్, ఫుట్వేర్)
కొరియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్
గ్రూపు మీటింగ్స్ :
17 కియా అనుబంధ సంస్థల ప్రతినిధులు (ఆటోమొబైల్)
కియాకు అనుబంధంగా ఉన్న మరో 27 టూ టైర్, త్రీ టైర్ సంస్థల ప్రతినిధులు (ఆటోమొబైల్)
దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు:
బూసన్ కాన్సులేట్ జనరల్ జియాంగ్ టెక్ మిన్
బూసన్ మెట్రో పాలిటన్ సిటీ మేయర్ సుహ్ బైంగ్సూ
ఎంవోయూలు : 2 లేదా 3
2 ఎంవోయూలు ఇప్పటికి ఖరారు, మరొకటి జరిగే అవకాశం
1. ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ ఎంవోయూ (ఇది ప్రాపర్టీ కంపెనీ)
(అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటుపై)
2. కియా మోటార్స్ 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందం.
3.బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం.
రోడ్ షోలు-బిజినెస్ సెమినార్లు : 2
5న ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం బిజినెస్ సెమినార్
6న కియా మోటార్స్తో కలిసి సియోల్లో బిజినెస్ సెమినార్