మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

న్యూ జెర్సీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం

Updated: 20-06-2017 05:13:54

న్యూ జెర్సీ: ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో న్యూ జెర్సీలోని రాజ్ భోగ్ రెస్టారెంట్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ సమావేశానికి మహారాష్ట్ర బిజెపీ అధికార ప్రతినిధి శ్వేతా షాలిని హాజరై ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం చేపడ్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అదే సమయంలో మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం చేపడ్తోన్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గత ప్రభుత్వాల పని సంస్కృతికి, ప్రస్తుత బిజెపీ ప్రభుత్వాల పని తీరుకి ఉన్న వ్యత్యాసాన్ని షాలిని ప్రవాస భారతీయులకు వివరించారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణ మాఫీల గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్వేతా షాలిని జవాబులు ఇచ్చారు. ప్రవాస భారతీయలు రైతుల సమస్యలపై, తెలంగాణ, మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యల గురించి అడిగారు. ప్రశ్నలన్నింటికీ షాలిని ఓర్పుగా సమాధానాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు కల్పన శుక్ల, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కోఆర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్, ఓఎఫ్ బిజెపీ  న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు ఆనంద్ జైన్, రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ మెంబర్షిప్ కన్వీనర్ ప్రమోద్ భగత్, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్ దిగంబర్ ఇస్లాంపురే, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ హరి సేథీ, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, విలాస్ రెడ్డి జంబుల, దీప్ భట్, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ పార్తీబన్ వర్ధన్, సహ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు ప్రదీప్ రెడ్డి, సందీప్ రెడ్డి సహా పలువురు ప్రవాస భారతీయలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.