ఢిల్లీలో ఏపీ పొలిటికల్ హీట్
Updated:
07-04-2018 12:29:54
న్యూఢిల్లీ: హస్తినలో ఏపీ పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, విపక్ష ఎంపీలు ఢిల్లీలోనే మకాం వేశారు. మరో రెండు రోజులు దేశ రాజధానిలోనే ఉండాలని సిఎం చంద్రబాబు సూచించారు. చంద్రబాబు ఇవాళ కూడా ఎంపీలు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తదుపరి కార్యాచరణ వెల్లడించేదాకా ఢిల్లీలోనే ఉండాలని సూచించారు. మరోవైపు ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఎంపీ మేకపాటి అస్వస్థతకు గురయ్యారు.