ఉక్రెయిన్లో తెలుగు విద్యార్ధులు మృతి.. విషాదంలో కుటుంబాలు
Updated:
20-09-2017 10:17:11
హైదరాబాద్: ఉక్రెయిన్లో బీచ్లో వాలీబాల్ ఆడుతూ సముద్రంలోకి వెళ్లిన ముఖేష్ అనే స్నేహితుడిని కాపాడటానికి వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోయారు.
ఉక్రెయిన్లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హైదరాబాద్ కుంట్లూరుకు చెందిన శివ కాంత్ రెడ్డి,
కడపకు చెందిన అశోక్ సముద్రంలో కొట్టుకుపోయారు. దీంతో విద్యార్ధుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. శివ కాంత్ రెడ్డి ఈ నెల ఒకటవ తేదీన సెలవులు ముగియడంతో అక్కడకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాలను భారత్కు రప్పించేందుకు యత్నాలు సాగుతున్నాయి.