శ్వేత సౌధంలో దీపావళి వేడుకలు
Updated:
19-10-2017 01:50:32
అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో దీపావళి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ ఉత్సవాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తరువాత శ్వేత సౌధంలో జరిగిన తొలి దీపావళి ఉత్సవం ఇదే. దీపం వెలిగించి వేడుకలు ప్రారంభించిన ట్రంప్ మాట్లాడుతూ ..భారత సంతతి అమెరికన్లు వైద్య, వ్యాపార, విద్య, శాస్త్రీయ రంగాల్లో అనితర సాధ్యమైన సేవలను అందించారని ప్రశంసించారు. భారత ప్రముఖలందరితో కలసి దీపావళిని నిర్వహించుకోవడం తనకు చెప్పలేనంత ఆనందాన్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.