అమెరికాలో లోయలో పడిన బస్సు.. భువనగిరి వాసి మృతి
Updated:
03-07-2017 01:33:44
నార్త్ కరోలినా: అమెరికా నార్త్ కరోలినాలో మినీ బస్సు లోయలో పడిన ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 28 సంవత్సరాల పొత్నక్ ప్రదీప్ మృతి చెందారు. ఘటనలో పలువురు భారతీయలు గాయపడ్డారు. ప్రదీప్ 28వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య కార్తీకకు కూడా గాయాలయ్యాయి. ఆరు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. కుమారుడు చనిపోయాడని తెలిసి ప్రదీప్ తల్లిదండ్రులు విషాద సాగరంలో మునిగిపోయారు. మరణవార్త తెలిసి వారి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ప్రదీప్ తల్లిదండ్రులను ఓదార్చడానికి వస్తున్నారు.