ఇంగ్లాండ్లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
Updated:
05-09-2017 01:36:20
లండన్: ఇంగ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కుల మధ్య మినీ బస్సు నలిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భారతీయులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు విప్రో ఉద్యోగులు ఉన్నారు. మృతదేహాలను భారత్కు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విప్రో ఉద్యోగులు వారి కుటుంబాలతో మినీ బస్సులో ప్రయాణిస్తుండగా బకింగ్హామ్షైర్లోని న్యూపోర్ట్ పాగ్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన ఇద్దరు ట్రక్కు డ్రైవర్లను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఇద్దరు డ్రైవర్లలో ఒకడు మద్యం తాగి ఉన్నాడు. ప్రమాదంలో తమవారిని పోగొట్టుకున్నవారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.