లండన్ చేరుకున్న జనసేన అధినేత
Updated:
17-11-2017 10:17:30
లండన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రిటన్ రాజధాని లండన్ చేరుకున్నారు. ఇండియా- యూరోపియన్ బిజినెస్ ఫోరం ప్రదానం చేసే ఐఈబిఎఫ్ గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించే అవకాశం ఉంది. రాజకీయ నేతగా సమాజంలో సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా పవన్ కళ్యాణ్కు ఈ అవార్డు దక్కింది. సెంట్రల్ లండన్లోని ఓ హోటల్లో బస చేసిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఎన్ఆర్ఐ ప్రముఖులను కలవడంతో పాటు జనసేనకు యూరప్లో మద్దతుదారులను పెంచేందుకు నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో జనసేన అధినేత పాల్గొంటారు. యూరప్ యూనివర్సిటీ విద్యార్ధులతో సమావేశమౌతారు. పవన్ కళ్యాణ్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించనున్నారు. జనసేనను బలోపేతం చేయనున్నారు. మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా పార్టీ నేతలను ఎంపిక చేస్తున్నారు.