మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

ఉగ్రదాడిలో చనిపోయిన అమర్‌నాథ్ యాత్రికుల కోసం అమెరికాలో శాంతి పూజలు

Updated: 18-07-2017 10:56:17

న్యూ జెర్సీ: అమరనాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అమెరికా న్యూజెర్సీలో ప్రత్యేక శాంతి పూజల సమావేశం నిర్వహించారు. న్యూ జెర్సీ ఎడిసన్‌లో గల శ్రీ సాయి దత్త పీఠంలో ఈ కార్యక్రమం జరిగింది. "అమరనాథ్ యాత్రికుల" పై జరిగిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం ప్రత్యేక శాంతి పూజలు చేశారు. ఆ తరువాత, చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఆ తరువాత సమావేశానికి విచ్చేసిన పెద్దలు రాబోయే కాలంలో ఇలాంటి ఘటనలు జరగగాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురించి మాట్లాడారు. హిందువుల ఐక్యత గురించి చర్చించారు. ఇలాంటి విషయాలలో హిందువులంతా , రాజకీయాలకు, జెండా-అజెండాలకు అతీతంగా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఐక్యత కోసం ప్రవాస భారతీయులందరు ముందు ఉంటారని వారు తెలిపారు. అదేవిదంగా, దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు  ప్రవాస భారతీయులు అండగా ఉంటారని తెలిపారు. హిందూ స్వయం సేవక్ సంఘ్ నేతలు నిమేష్ దీక్షిత్, గణేష్ రామకృష్ణన్ మాట్లాడుతూ హిందూ మిత్రులు ఏకతాటిఫై నిలబడి సంఘీభావం తెలపాలన్నారు.
 
సత్య దోసపాటి మాట్లాడుతూఇస్లామిక్ ఉగ్రవాద చర్యలను ఖండించారు. ఇలాంటి ఇస్లామిక్ ఉగ్రవాద ఘటనలు అనేక మంది సామాన్య జనాలతో పాటు, అనేక మంది సైనికుల ప్రాణాలు తీశాయని చెప్పారు. 
 
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ  అధ్యక్షుడు కృష్ణ రెడ్డి ఏనుగుల మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను ఖండించారు. ఉగ్రవాదానికి మూలమైన పాకిస్తాన్‌ను  ఏకాకిగా చేయాలని పిలుపునిచ్చారు.
 
గ్లోబల్ ఇండియా ఫర్ భారత్ వికాస్ ప్రెసిడెంట్ గౌరంగ్ వైష్ణవ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, దాన్నే జీవిత లక్ష్యంగా చేసుకొని పోరాడండనే వాక్యాలను ఉగ్రవాద పోరాటంలో పాటించాలని సూచించారు. 
 
సాయి దత్త పీఠం వ్యవస్థాపకులు రఘు శర్మ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రవాస భారతీయులందరూ ఒకే తాటి మీదకు రావాలని కోరారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన విలాసరెడ్డి జంబుల, గణేష్, మీడియా ఇంచార్జి దిగంబర్, సాయి దత్త పీఠం బోర్డు మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
కార్యక్రమంలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ మీడియా కో కన్వీనర్ దిగంబర్ ఇస్లాంపురే, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బిజేపీ న్యూ జెర్సీ యూత్  కన్వీనర్ పార్తీబన్ వర్ధన్, గోపి, నగేష్, మురళి, లక్ష్మి, పవన్, అచ్చుతరెడ్డి, దాముతో పాటు అనేక  మంది ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు.

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.