విజయ్ మాల్యాకు లండన్లో ఘోర పరాభవం!
Updated:
11-06-2017 07:12:08
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ చెక్కేసిన బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాకు ఘోర పరాభవం ఎదురైంది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డేను వీక్షించేందుకు వచ్చిన విజయ మాల్యాను చూసిన భారత ప్రేక్షకులు ‘మాల్యా దొంగ’, ‘దొంగ’ అని అరిచారు. అంతేకాదు అతనికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రూపాయలు ఎగవేసిన మాల్యా ఇటీవల బర్మింగ్హామ్లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చి కెమెరాలకు చిక్కాడు. ఈ సందర్భంగా అన్ని మ్యాచ్లకు వస్తానని అప్పుడే కెమెరాల సాక్షిగా చెప్పడం గమనార్హం.