మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ప్రవాస వార్తలు

బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డ్ అందుకున్న పవన్

Updated: 18-11-2017 09:50:48

లండన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ అవార్డ్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తోన్న సామాజిక, సంఘ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో అవార్డు ఇచ్చే సందర్భంలో ఐఈబిఎఫ్ పవన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పవన్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారని కీర్తించింది. పవన్ అవార్డు తీసుకుంటున్న కార్యక్రమానికి జనసేన నేతలతో పాటు యూరప్‌లోని జనసేన మద్దతుదారులు కూడా హాజరయ్యారు. పవన్ అవార్డ్ తీసుకుంటున్న ఫొటోలను జనసేన తమ ట్విటర్ పేజీలో షేర్ చేసింది. పవన్ నిన్న లండన్‌లోని అంబేద్కర్ స్మారక మందిరాన్ని సందర్శించి అంబేద్కర్‌కు నివాళులర్పించారు. 

షేర్ :

మరిన్ని ప్రవాస వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.