అమెరికాలో కూలిన విమానం.. మచిలీపట్నంకు చెందిన దంపతులు దుర్మరణం
Updated:
11-07-2017 10:11:15
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానాలో చార్టెడ్ విమానం కూలింది. బెవర్లీలోని వాషింగ్టన్ కౌంటీ సమీపంలో విమానం కూలడంతో మచిలీపట్నంకు చెందిన డాక్టర్ ఉమామహేశ్వర్(63) , సీతాగీత చనిపోయారు. ఈ దంపతులు 40 సంవత్సరాలుగా అమెరికాలోని ఇండియానాలో స్థిరపడ్డారు. ఉమా మహేశ్వర్ దంపతులు చనిపోవడంతో అటు ఇండియానాలోనూ, ఇటు మచిలీపట్నంలోనూ విషాదం నెలకొంది.