రాజధాని రైతులకు సింగపూర్లో ఘన స్వాగతం
Updated:
31-10-2017 10:59:29
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు సింగపూర్లో ఘన స్వాగతం లభించింది. సింగపూర్ తెలుగు దేశం ఫోరం ఆధ్వర్యంలో రైతులకు స్వాగతం లభించింది. ఫోరం ప్రతినిధులు సింగపూర్ ఎయిర్ పోర్ట్లో రైతులకు పుష్పగుఛ్ఛాలిచ్చి, శాలువలు కప్పి ఆహ్వానం పలికారు. స్వాగతం పలికిన వారిలో సింగపూర్ తెలుగు దేశం ఫోరం
అధ్యక్షుడు జయరామ్, ఉపాధ్యక్షుడు చెన్నుపాటి భానుచంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ్, సెక్రటరీ సతీశ్ తదితరులున్నారు.