అమెరికా పర్యటనలో కేటీఆర్ బిజీబిజీ
Updated:
23-05-2017 09:35:10
కాలిఫోర్నియా: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సన్మైనా చైర్మెన్ సిఈవో జూర్ సొలాతో సమావేశమయ్యారు ఎలక్ట్రానిక్స్ తయారీలో పెట్టుబడులపై చర్చించారు. సిలికాన్ వ్యాలీలో ఆయన అడోబ్ సిఈఓ శంతనూ నారాయణ్ను, హెచ్పికి చెందిన కీర్తి మేల్కొటేను కలుసుకున్నారు. ఆ తర్వాత సిలికాన్ వ్యాలీలో వివిధ సంస్థలకు చెందిన ప్రముఖులకు ఇచ్చిన విందులో కేటీఆర్ కూడా పాల్గొన్నారు. నిన్న కాలిఫోర్నియా జరిగిన వల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ 2017 కార్యక్రమంలో ఆయన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజలకు సాగు, తాగునీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ వివరించారు.