మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కోహ్లీ
Updated:
16-02-2018 11:56:13
సెంచూరియన్: ఆరు వన్డేల సిరీస్ను 5-1తో గెలుచుకున్న భారత్ ప్రతి దశలోనూ ఆధిక్యతను చాటుకుంది. కోహ్లీ నాయకత్వం కూడా ఇందుకు తోడ్పడింది. ఈ సిరీస్లో కోహ్లీ మూడు సెంచరీలు చేశాడు. వన్డే సిరీస్ నెగ్గడం ద్వారా టెస్ట్ సిరీస్ ఓటమికి కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. వాన పడిన నాలుగో వన్డేలో కూడా భారత్ దూకుడుగానే ఆడింది. అయితే డక్వర్త్ లూయీస్ ప్రకారం సౌతాఫ్రికాకు చిన్న టార్డెట్ ఇచ్చారు. దీంతో ఆ ఒక్క మ్యాచ్ను మాత్రం ఆతిధ్య దేశం గెలవగలిగింది. వన్డే సిరీస్లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించడం ద్వారా భారత్ సౌతాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించినట్లైంది.