తిరుమల సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన టిటిడి ఈవో, జెఈవో
Updated:
04-08-2017 01:21:14
తిరుమలలోని పిఏసి-4లో గల సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ గురువారం తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజుతో కలిసి పరిశీలించారు. అక్కడి సిసి కెమెరా వ్యవస్థపై సివిఎస్వో ఎ.రవికృష్ణ ఈ సందర్భంగా ఈవో, జెఈవోలకు వివరించారు.
అనంతరం పిఏసి-4లో గల లగేజి డిపాజిట్ కేంద్రాన్ని ఈవో తనిఖీ చేశారు. భక్తులకు ఆలస్యం కాకుండా లగేజి, సెల్ఫోన్లు అందించాలని అక్కడి సిబ్బందికి సూచించారు. ఆ తరువాత మ్యూజియం ఎదురుగా గల వృద్ధులు, దివ్యాంగుల టోకెన్ జారీ కేంద్రాన్ని పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని అక్కడి అధికారులను ఆదేశించారు. పక్కనే ఉన్న వంటశాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని భక్తులకు ఈ వంటశాల నుంచి అన్నప్రసాదాల పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు.
ఈవో వెంట టిటిడి ఎస్ఇ-2 రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు, విజిఓ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
తిరుమల