ఆదియోగి సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు
Updated:
13-02-2018 11:48:01
చెన్నై: కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ సెంటర్లో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న జాగరణోత్సవానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆదియోగి సన్నిధిలో యోగా, ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇషా యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.