మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

తిరుపతి ఖాదీ కాలనీ సాయిబాబా మందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Updated: 10-07-2017 03:05:09

తిరుపతి: గురుపౌర్ణమిని తిరుపతి ఖాదీ కాలనీలోని సాయిబాబా మందిరంలో కన్నుల పండువగా జరుపుకున్నారు. 2003లో ప్రారంభమైన సాయిబాబా గుడిలో ప్రతియేటా గురుపౌర్ణమిని విశేషంగా జరుపుకుంటున్నారు. షిర్డీ తరహాలో సంప్రదాయ బద్ధంగా సాయిబాబాకు నాలుగు హారతులు కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్యా హారతి, తేజ్ హారతి ఇచ్చారు. భజనలతో పాటు సత్సంగము నిర్వహించారు. రాఘవ బృందంచే సాయి సంగీత విభావరి నిర్వహించారు. మేళతాళాలు, భజనలు, నాట్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం రెండు వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపకులు ప్రభాకర్ శాస్త్రి సారధ్యంలో యేటా నిర్విఘ్నంగా ధార్మిక, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.  

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.