మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

మరో రూ.200 పడిపోయిన పసిడి ధర

Updated: 23-10-2017 09:43:12

ముంబై: బంగారం ధర మరోమారు పతనమైంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.200 తగ్గి రూ.30,450కి చేరుకుంది. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర నేల చూపులు చూసినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కిలోకు రూ.50 పెరిగి రూ.40,900కు చేరుకుంది.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.