పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
Updated:
03-10-2017 08:20:20
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం తీపి కబురిచ్చింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. తగ్గించిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్ధిక శాఖ కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది.వాస్తవానికి ఇటీవల పెట్రో ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించింది. పెట్రో ధరలను గణనీయంగా తగ్గించే కేంద్రం ఉన్నట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే తెలిపారు. పెట్రో ఉత్సత్తులను జిఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆ తీపి కబురు కోసం వాహనదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.