మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్

Updated: 27-10-2017 09:24:52

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. శాంసంగ్ ఫెస్ట్ పేరుతో ఆ బ్రాండ్ ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ ఆఫర్లు ఆదివారం వరకు కొనసాగనున్నాయి. ఫోన్ల కొనుగోలుపై గరిష్టంగా రూ.4700 వరకు డిస్కౌంట్ పొందవచ్చని అమెజాన్ తెలిపింది. అలాగే శాంసంగ్ ఫోన్ల కొనుగోలు చేసిన వినియోగదారులకు రిలయన్స్ జియో నుంచి 90 జీబీ డేటా ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. 
 
శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రొ, ఆన్ 7ప్రొలపై ఫ్లాట్ రూ.800 రాయితీ ఆఫర్ చేస్తుండగా గెలాక్సీ జే5పై రూ.900, గెలాక్సీ ఏ9ప్రొపై రూ.2300 తగ్గించి విక్రయిస్తున్నట్టు తెలిపింది. గెలాక్సీ ఎ7, ఎ5లపై రూ.4వేలు, ఎ5పై రూ.4,510 రాయితీ ఇస్తున్నట్టు అమెజాన్ వివరించింది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నట్టు తెలిపింది. 
 
 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.