జియోకు కోలుకోలేని షాక్.. రూ.1399కే ఎయిర్టెల్ స్మార్ట్ఫోన్!
Updated:
11-10-2017 08:44:12
న్యూఢిల్లీ: టెలికం రంగంలో అడుగుపెట్టి ప్రత్యర్థి కంపెనీలను తీవ్రంగా దెబ్బతీసిన రిలయన్స్ జియోకు భారతీ ఎయిర్టెల్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జియో తీసుకొచ్చిన 4జీ ఫీచర్ఫోన్కు పోటీగా అత్యంత చౌక ధరలో ఏకంగా స్మార్ట్ఫోన్నే అందించేందుకు సిద్ధమైంది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్ ఫోన్’ పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.1399 మాత్రమే.
దేశీయ మొబైల్ మేకర్ కార్బన్తో జతకట్టి అందిస్తున్న ఈ ఫోన్ ధర నిజానికి రూ.3499 కాగా, ఎయిర్టెల్ దీనిని రూ.2,899కే అందిస్తోంది. ఇందులో రూ.1500ను మూడేళ్ల తర్వాత తిరిగి ఇవ్వనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. అంటే వినియోగదారులకు ఈ ఫోన్ను రూ.1399కే లభిస్తుందన్నమాట. అయితే మూడేళ్ల తర్వాత క్యాష్ బ్యాక్ కావాలనుకునే వినియోగదారులు తొలి ఏడాదిన్నరపాట రూ.3 వేల వరకు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే తొలి విడతగా రూ.500 వెనక్కి వస్తుంది. ఆ తర్వాత 18 నెలలూ ఇలాగే రీచార్జ్ చేస్తే మిగతా రూ.1000 వెనక్కి ఇస్తుంది. ఈ ఫోన్తోపాటు ఎయిర్టెల్ ప్రత్యేకంగా ఆఫర్ కూడా తీసుకొచ్చింది. రూ.169 రీచార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్తోపాటు రోజూ 500 ఎంబీ డేటాను పొందవచ్చు. జియో 4జీ ఫీచర్ఫోన్లు డెలివరీకి వచ్చినట్టు చెబుతున్నా ఇప్పటి వరకు వినియోగదారుల చేతుల్లోకి రాకపోవడంతో చాలామంది ఈ ఫోన్పై ఆశలు వదిలేసుకుంటున్నారు. ఈ సమయంలో ఎయిర్టెల్ ప్రకటన వారి మనసులను దోచుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.