మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

స్వైప్ నుంచి రూ.8,499కే పది అంగుళాల ట్యాబ్లెట్

Updated: 27-10-2017 07:44:38

న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ మేకర్ స్వైప్ శుక్రవారం 10.1 అంగుళాల ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే కలిగిన ఈ ట్యాబ్లెట్ ధర రూ.8,499 మాత్రమే. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ ట్యాబ్‌లెట్‌ను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని స్వైప్ తెలిపింది. 
 
1.1 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ, 32 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉన్నాయి. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ట్యాబ్‌ 4జీకి సపోర్ట్ చేస్తుంది. వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వెనక 5ఎంపీ రియర్ కెమెరా, ముందు 2ఎంపీ కెమెరా ఉంది. 

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.