మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో

Updated: 06-01-2018 09:32:23

ముంబై: హ్యాపీ న్యూ ఇయర్ 2018 ఆఫర్‌లో భాగంగా రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపైనా రూ.50 రాయితీ కానీ,  లేదంటే 50 శాతం అదనపు డేటాను కానీ ఖాతాదారులు పొందే వీలుంది. కొత్త  ప్లాన్లు ఈనెల 9 నుంచి అందుబాటులోకి రానున్నాయి. 
 
జియో ప్రస్తుతం అందిస్తున్న రూ.199 ప్లాన్ ఇకపై రూ.149కే లభించనుంది. జనవరి 9 నుంచి ఈ ప్లాన్ అందుబాటులోకి రానుంది. అలాగే రూ.399, రూ.459, రూ.499  ప్లాన్లు ఇకపై రూ.349, రూ.399, రూ.449 కే అందుబాటులో ఉంటాయి. కాలపరిమితి వరుసగా 28, 70, 84, 91 రోజులు. డేటా విషయాన్ని వస్తే రూ.149 ప్యాక్‌పై 28 జీబీ, రూ.349పై 70, రూ.399పై 84 జీబీ, రూ.449పై 91జీబీ లభిస్తుంది. మిగతా ప్రయోజనాలు అన్నీ గతంలోనివే కొనసాగుతాయి. 
అలాగే రూ.198, రూ.398, రూ.448,  రూ.498 ప్లాన్లపై అదనంగా 50 శాతం అధిక డేటాను అందించనుంది. 
  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.