కోహ్లీ దెబ్బకు ధోనీ రికార్డు బద్దలు
Updated:
26-01-2018 05:54:12
జొహన్నెస్బర్గ్: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దెబ్బకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డు బద్దలైంది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. 60 టెస్టులు ఆడిన ధోనీ 3,454 పరుగులు చేశాడు. కేవలం 35 టెస్టులు మాత్రమే ఆడిన కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. 47 టెస్టులు ఆడి 3,449 పరుగులు చేసిన సునీల్ గవాస్కర్ మూడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్లో ఇప్పటికే 0-2తో వెనుకబడి సిరీస్ను కోల్పోయిన భారత్ జొహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో తలపడుతోంది.