ఏపీ, తెలంగాణల్లో పెరగనున్న 38 పీజీ మెడికల్ సీట్లు
Updated:
18-02-2017 06:16:38
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే విద్యా సంవత్సరాని (2017-18)కి 38 పీజీ వైద్య విద్య సీట్లు పెరగనున్నాయి. వీటిలో ఏపీకి 27, తెలంగాణకు 11 సీట్లు కేటాయించాలని భారత వైద్య మండలి(ఎంసీఐ) సిఫార్సు చేసింది. ఈ సీట్లకు అనుమతి ఇవ్వడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంబంధిత కళాశాలలకు సమాచారం పంపింది.