వివిధ సెట్ల షెడ్యూల్స్ ప్రకటించిన మంత్రి గంటా
Updated:
08-01-2018 12:36:58
అమరావతి: ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వివిధ సెట్ల షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 19న ఎడ్సెట్, లాసెట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 22-25 మధ్య ఇంజినీరింగ్, మే 26న ఎంసెట్ (బైపీసీ), మే 2న ఐ సెట్, మే మూడున ఈసెట్, మే నాలుగున పియూ సెట్, మే 10 నుంచి 12 వరకూ పీజీ సెట్ నిర్వహిస్తారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తారు. ఎంసెట్ నిర్వహణకు 115 నుంచి 150 సెంటర్లను కేటాయించారు. విశాఖలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను యూనివర్సిటీగా మార్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని, వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు చేపడతామని చెప్పారు.