ఆ పరీక్ష రాసేవారి వయోపరిమితి సడలించిన సుప్రీంకోర్టు
Updated:
01-04-2017 01:16:18
న్యూఢిల్లీ: నీట్ 2017 రాసేవారి వయో పరిమితిని సుప్రీంకోర్టు సడలించింది. పాతికేళ్లు దాటిన వారు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో దరఖాస్తులు పంపేందుకు గడువును ఏప్రిల్ 5వరకూ పొడిగించారు. వాస్తవానికి నీట్ అభ్యర్ధుల వయోపరిమితిని పాతికేళ్లుగా సిబిఎస్ఈ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని కొందరు న్యాయస్థానంలో సవాలు చేశారు.