Updated: 20-10-2017 06:08:20
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. సుమారు 8 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. కొత్త జిల్లాల మేరకు టీచర్ల నియామకం చేపడ్తున్నారు. అభ్యర్థి స్థానికతకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త లేదా పాత జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో పరీక్ష రాసుకునే వెసులుబాటును ప్రభుత్వం ఇవ్వనుంది. నోటిఫికేషన్ ప్రతిని పట్టుకుని ఈ నెల 23న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రంజీవ్ ఆచార్య సుప్రీంకోర్టు ముందు హాజరు కానున్నారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ప్రారంభించమని కోర్టుకు తెలుపనున్నారు. టీచర్ల నియమాలను పూర్తి చేయనందుకు గతంలో తెలంగాణ సర్కారుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 23న స్వయంగా కోర్టుకు రావాలని రంజీవ్ అచార్యను సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.
షేర్ :
తాజా వార్తలు