స్టెంట్లకు అధిక రేటు వసూలు చేస్తున్నారు!
Updated:
02-03-2017 09:17:56
దిల్లీ: గుండె రోగులకు అవసరమైన స్టెంట్ల ధరలు కేంద్రం భారీగా తగ్గించడంతో ఆ ధరలకే అమ్మాలని ఆదేశించినప్పటికీ.. అది అమలవడం లేదు. ఇందుకు నిదర్శనం జాతీయ ఔషధ ధరల సంస్థ(ఎన్పీపీఏ)కు 24 ఫిర్యాదులు అందడమే. స్టెంట్ల ధరలు ఎక్కువగా వసూలు చేస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ఎన్పీపీఏకు 24 మంది కంప్లెయింట్ చేశారు. దీనిపై స్పందించిన ఎన్పీపీఏ 9 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.