మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆరోగ్యం న్యూస్

ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవం

Updated: 21-06-2017 03:17:33

లక్నో: ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 200కు పైగా దేశాలు అంతర్జాతీయ యోగా డే ను జరుపుకుంటున్నాయి. భారత్‌లో 74 మంది కేంద్ర మంత్రులు 74 నగరాల్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బాబా రాందేవ్‌తో కలిసి అహ్మదాబాద్‌లో యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ అనేక ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం జరుగుతుందని చెప్పారు. ప్రపంచ ప్రజలంతా యోగా చేసి ప్రయోజనం పొందాలని సూచించారు. మరోవైపు దుబాయ్ మొదలుకొని అమెరికా వరకూ అన్ని దేశాల్లో యోగా డే ను ఘనంగా జరుపుకున్నారు. 

షేర్ :

మరిన్ని ఆరోగ్యం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.