ఆరోగ్యంపై శ్రద్ధ లేనివారు మెరుగైన జీవితం గడపలేరు
Updated:
27-03-2017 01:54:21
హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని అంతా ఒంటబట్టించుకోవాలని సొసైటీ ఫర్ సోషల్ సైంటిస్ట్స్ సంస్థ అధ్యక్షుడు జి.వి చలపతిరావు చెప్పారు. హైదరాబాద్ పద్మారావునగర్లోని ట్రిపుల్ ఎస్ కార్యాలయ ప్రాంగణంలో ప్లాన్ యువర్ హెల్త్ సంస్థతో కలిసి ఏర్పాటుచేసిన ఉచిత రక్తపరీక్షల శిబిరాన్ని చలపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మెరుగైన జీవనం కోసం అంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరచాలన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధలేనివారు మెరుగైన జీవనం గడపలేరని చెప్పారు. వ్యాయమం, ప్రాణాయామం, ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకుంటే జీవితాలు మెరుగుపడతాయన్నారు. శిబిరంలో వందలాదిమంది స్థానికులు రక్తపరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఎస్ నిర్వాహకులు కె.వి.శేషసాయి, భోగేంద్రనాథ్ గుప్త, సారంగధర్రావు, కార్తికేయవాసు, విజయ్, సాయి, పి.వి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.